మహబూబాబాద్ లో మహిళలకు అండగా మేమున్నామనే సంకీర్ణ భావంతో రాష్ట్ర మంత్రి వర్యులు గిరిజన, శిశు, స్త్రీ సంక్షేమశాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ మరియు పార్లమెంట్ సభ్యురాలు కవిత, మహబూబాబాద్ కలెక్టర్ శివలింగయ్య, జడ్పీఛైర్మన్ కుమారి అంగోత్ బిందు సఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ: మహిళలకు అన్యాయం జరిగితే సహించేదే లేదని అండగా నేను ఉన్నానని, ఇంకా సఖీ కేంద్రాన్ని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తట్యాతండా గ్రామ సర్పంచ్ రమేష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.