గోపాల్ పూర్ కు చెందిన సాగంటి మంజులను సేవా రత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు పరకాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రాంతి జ్యోతి మహిళ సాధికారత సంస్థ అధ్యక్షురాలు రజిని రుద్రమ మరియు సభ్యులు ఈ అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ తాను లెక్చరర్ గా, రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే సామజిక సేవలో తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నానని, ఈ అవార్డుల వల్ల మరింత బాధ్యత పెరుగుతుందని మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఎస్ ఐ రావేళ్ల రామారావు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. నేను సైతం ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలో ప్రోగ్రాం కన్వీనర్ గా వ్యవహరిస్తున్న మంజుల కు ఆ సంస్థ బాధ్యులు రావుల రమేష్ గౌడ్ ,నిమ్మల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు