హైరాబాదులోని ఘటకేసర్ పరిధిలో ఓ యువకుడిని నమ్మించి అతడిని ఇంటికి రప్పించి దాడి చేసి డబ్బు దోచుకున్న ఘటన జరిగింది. పూర్తి వివరాలుః భద్రాద్రి కొత్తకూడెం పాల్వంచ మండలం పరిధిలో నివాసముండే వంశీ అతడి భార్య రోజాతో పాటు ఆమె సోదరి దేవి ఘటకేసర్ లోని పోచారంలో వుంటున్నారు. ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వర్మ అనే వ్యక్తితో పరిచయమైంది. వీరంతా బయటకు వెళ్లినప్పుడు మియాపూర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన ప్రియుడికి ఫోన్ చేసింది రోజా. ఇంట్లో తను ఒక్కదాన్నే వున్నాననీ, కుటుంబ సభ్యులు భీమవరానికి వెళ్లారని చెప్పింది.

దాంతో అతడు నేరుగా రోజా వద్దకు వచ్చాడు. ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు. ఐతే అర్థరాత్రి వేళ వంశీ, వర్మ, దేవి ముగ్గురు ఇంటికి వచ్చారు. తలుపు తట్టగానే రోజాతో పాటు ఆమె ప్రియుడు కంటబడ్డాడు. అంతే అతడికి దేహశుద్ధి చేసి బెదిరించి పంపారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చేరవేయడంతో కేసు నమోదు చేసుకున్న విచారిస్తున్నారు.