11వేల కోట్లిస్తే? విగ్రహానికే 3వేల కోట్లా ?
స్టాచ్యూ ఆఫ్ యూనిటీపై యూకే విమర్శలు:
నర్మదా నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తయిన సర్దార్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ఏర్పాటును యూకే తప్పుపట్టింది. 2012 నుంచి దాదాపు 11వేల కోట్లు సాయంగా అందిస్తే. అందులో దాదాపు 3 వేల కోట్లు ఈ విగ్రహానికే ఖర్చు చేశారని బ్రిటన్ అధికారపక్ష ఎంపీ పీటర్ బోన్ విమర్శించారు. విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు చేసిందంటే, ఇక భారత్కు మేం సాయం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఇక స్వదేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి : విగ్రహ ఏర్పాటుపై విపక్షాల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి . నర్మదా కెనాల్ నెట్వర్కు పూర్తి చేయలేదు గాని కోట్లు ఖర్చు చేసి విగ్రహాన్ని పూర్తి చేస్తారని. సర్దార్ పటేల్ కి సరైన నివాళి అర్పించాలి అనుకుంటే నర్మదా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని గుజరాత్ సీఎంకు సవాల్ విసిరింద..