తన ఇంట్లో పనిచేస్తున్న ఓ మైనర్ బాలిక మీద పోలీస్ కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ శివారులోని ముకుంద్ ఏరియాలో ఉండే ఓ కానిస్టేబుల్ తన ఇంట్లో పనిచేస్తున్న 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. మంగళవారం ఉదయం కానిస్టేబుల్ ఇంట్లో వారు బయటకువెళ్లినప్పుడు ఆ బాలిక ఒంటరిగా ఉంది. దీంతో ఆమె మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గతంలో కూడా బాలిక మీద లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీస్ కానిస్టేబుల్ పరారయ్యాడు. నిందితుడి పేరు, ఇతర వివరాలు తెలియలేదు. అయితే, ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తాడని తెలిసింది. పోలీస్ కానిస్టేబుల్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు…