{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1639897079138","origin":"gallery","is_remix":true,"used_premium_tools":false,"used_sources":"{"sources":[{"id":"308819914168201","type":"ugc"}],"version":1}","source_sid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1639929063780","premium_sources":[],"fte_sources":["308819914168201"]}

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నగరంలో 15 ఏళ్ల ఓ బాలిక తీవ్ర దారుణానికి ఒడిగట్టింది. యూట్యూబ్‌లో చూస్తూ ఇంట్లో సొంతంగా కాన్పు చేసుకొని పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది. స్థానిక అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ వ్యక్తి లైంగికంగా దగ్గరయ్యాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పలేదు. ఓ దశలో పొట్ట పెద్దగా కనిపించడంతో తల్లి ప్రశ్నించగా అనారోగ్యమే కారణమంటూ ఏమార్చింది.

ఆపై- కాన్పు ఎలా చేసుకోవచ్చో యూట్యూబ్‌ వీడియోలను చూస్తూ తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆ పసిగుడ్డును గొంతునులిమి చంపేసింది. ఇంట్లోనే ఓ పెట్టెలో మృతదేహాన్ని దాచిపెట్టింది. పనిమీద బయటకు వెళ్లిన తల్లి తిరిగొచ్చేసరికి బాలిక అనారోగ్య స్థితిలో కనిపించింది. ఆమె గట్టిగా ప్రశ్నించడంతో మొత్తం విషయాన్ని చెప్పేసింది. శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.