2019 ప్రపంచ కప్ ముగిసింది ! ఇక మళ్ళీ 2023లో ప్రపంచ కప్ మొదలవుతుంది . ఈ ప్రపంచ కప్ కి గాను షెడ్యుల్ ఖరారు అయింది “2023 ఫిబ్రవరి 9 నుంచి మార్చ్ 26“ వరకు వరల్డ్ కప్ షెడ్యుల్ ని ఫిక్స్ చేసారు . అయితే ఈ ప్రపంచ కప్ కి భారత్ జట్టు ఆతిధ్యం ఇవ్వనుంది .. 1987, 1996, 2011 లో పొరుగు దేశాల అయిన బంగ్లాదేశ్ , శ్రీలంక లతో కలిసి భారత్ ప్రపంచ కప్ కి ఆతిధ్యం ఇచ్చింది . కానీ ఈ సారి ఒక్క భారత్ లోనే మొత్తం వరల్డ్ కప్ జరగనుంది . ఐసీసీ నిభందలన ప్రకారం టాప్ 8 లో ఉండే జట్లు నేరుగా టోర్నీలో అడుతాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటి పడుతాయి .