తండ్రి పెళ్లికి నిరాకరించాడని మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగపూర్‌ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం. గ్రామానికి చెందిన చేప్యాల కనకయ్య-కనకవ్వ దంపతుల మూడో కుతురు చేప్యాల రేణుక (20) జిల్లా కేంద్రంలో డిగ్రీ థర్డ్‌యిర్‌ చదువుతుంది. ఆదివారం రాత్రి కూతుళ్ల పెళ్లి విషయంపై ఇంట్లో చర్చించుకుంటుండగా రేణుక తనకు పెళ్లి చేయాలని తల్లి దండ్రులను కోరింది. పెద్ద కుతురు వివాహం చేయక ముందే నీ వివాహం ఎలా చేస్తామని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన యువతి సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు పెట్టుకుని ఆత్మహుతి చేసుకుంది. మంటలు చేలరేగడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకునే సరికి రేణుక పూర్తిగా కాలిపోయి మృతి చెందిన్నట్లు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై శేఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.