అక్రమ సంబంధంతో ప్రియుడితో కలసి లాడ్జికి వచ్చి ఏసి వెంటిలేటర్ వద్ద గాలి పీల్చిన ఓ మహిళ అనంతలోకాల వేల్లిన ఘటన రేపల్లెలో జరిగింది . ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నిజంపట్నం మండలం గరువుపాలెం పంచాయతీ హమాన్ తోట గ్రామానికి చెందిన దాకారి . శాంతకుమారి ( 45 ) ముసలయ్య దంపతులకు 3 కుమారులు ఉన్నారు . వీరంతా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . అయితే గత కొంతకాలంగా పరిచయం ఉన్న సోడాపాలెంకి చెందిన మొషే అనే వ్యక్తితో అక్రమ సంబంధానికి దారి తీసింది . ఈ నెల 12వ తేదిన శాంత కుమారి తన పది సంవత్సరాల బాబుని తీసుకొని సంతకు వెళ్లి వస్తానని చెప్పి మొసేతో కలసి రేపల్లె జీకే లాడ్జికి చేరుకుంది . మొషే శాంతకుమారి తాము భార్య భర్తలమని , 10 సంవత్సరాల బాలుడు తమ కుమారుడిగా జీకే లాడ్జిలో రూమ్ తీసుకున్నారు .

కానీ భార్య సంతకు అని చెప్పి లాడ్జికి వెళ్లినట్టు తెలిసిన ఆమె భర్త ముసలయ్య లాడ్జిలోకి రావటం గమనించిన శాంతకుమారి పక్కనే ఉన్న ఏసి వెంటిలేటర్ దగ్గర బాలుని పెట్టుకొని దాక్కునే ప్రయత్నం చేసింది . అయితే భర్త వెళ్లి పోయినా ఆమె అక్కడ నుంచి కదలక పోవటం గమనించిన మోషే లాడ్జి సిబ్బంది సహాయంతో హాస్పిటల్ కి తరలించారు . డాక్టర్లు పరీక్ష చేసి, చాలా సేపు ఏసి వెంటిలేటర్ వద్ద ఉండటం వల్ల వాటి నుంచి వచ్చే వాయువు బలంగా పీల్చి అపస్మారక స్థితికి వెళ్ళిందని , ఆసుపత్రికి తెచ్చే సమయానికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు . సమాచారం అందుకున్న రేపల్లె పట్టణ సీఐ S . సాంబశివరావు పట్టణ ఎస్ఐ ఎంవి . చరణ్ హాస్పటల్ వద్ద ఆమె కుటంబ సభ్యులు వద్ద నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు . ఈ ఘటనపై 174 సెక్షన్ కింద అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని , మెషీను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు..