పురుషుడి శరీరంలో గర్భసంచి బయటపడిన అరుదైన ఘటన ఇది. రెండేళ్ల క్రితం వివాహమయిన 29 ఏళ్ల వ్యక్తి ఒకరు తమకు సంతానం కలగలేదంటూ వైద్య పరీక్షల కోసం ముంబయి జేజే ఆసుపత్రికి వచ్చారు. ఆ వ్యక్తి శరీరంలో గర్భసంచి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అండాశయాలు జీర్ణాశయానికి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆ వ్యక్తి మహిళా, పురుషుడా అనేది తేల్చేందుకు డా.గీతే పరీక్షలు నిర్వహించారు. లింగపరంగా పురుషుడేనని వైద్యులు నిర్ధరించారు. వివిధ పరీక్షల అనంతరం శస్త్రచికిత్స ద్వారా గర్భసంచిని విజయవంతంగా తొలగించి, ఆ తర్వాత మరో సర్జరీ ద్వారా అండాశయాలను వృషణాల్లో అమర్చినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 200 మంది పురుషుల శరీరాల్లో గర్భసంచి ఉన్న ఘటనలు నమోదయ్యాయి. జేజే ఆసుపత్రిలో మాత్రం ఇదే తొలి కేసు.