బెంగళూరు: ఆస్తి కోసం అత్త వేధిస్తోందని ఆరోపిస్తూ ఆనంద్‌ కుమార్‌ (43) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అత్త గంగమ్మ, బావమరిది గంగరాజు, భార్య నీలమ్మ తనను గదిలో బంధించి నిత్యం వేధిస్తున్నారని ఆత్మహత్యకు ముందుగా బాధితుడు రాసిన లేఖను త్యామగుండ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొడ్డబళ్లాపుర సమీపంలోని తోటనహళ్లికి చెందిన ఆనంద్‌ కుమార్‌ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తన ఆస్తిని భార్య పేరుతో రాయాలని ఒత్తిడి చేస్తూ గదిలో బంధించి నిత్యం శారీరకంగా హింసించారని లేఖలో పేర్కొన్నారు.