ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమె మర్మాంగాన్ని కత్తితో కోసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కొండూరు మండలంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: మూడా బాలు (45) అనే కామాంధుడు ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం మహిళ మర్మాంగాన్ని కత్తితో కోసి పారిపోయాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఆమె చిన్నమ్మ వరస అవుతుందని పోలీసులు వెల్లడించారు. గతంలో మూడా బాలు పలువురు మహిళలపై అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్టు గ్రామస్థులు తెలిపారు.