అర్ధరాత్రి ఇంటి గోడలు దూకి నగ్నంగా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి చేష్టలకు ప్రజలు భీతి చెందుతున్నారు. కడలూర్‌ జిల్లా విరుదాచలం వీఎన్‌ఆర్‌ నగర్‌కు చెందిన దర్జీ రంజాన్‌ అలీ (45) సొంతమైన ఇంట్లో ఉమ్మడికుటుంబతో నివసిస్తున్నారు.

గత 13వ తేదీ వేకువజామున ఆ ప్రాంతంలో వున్న ఇళ్ల తలుపులను ఎవరో తడుతున్నట్లు శబ్దాలు వినిపించాయి. ఉదయం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో ఫుటేజీలను రంజాన్‌ అలీ పరిశీలించారు. అందులో 45 ఏళ్ల వ్యక్తి నగ్నంగా సంచరిస్తూ అక్కడున్న గోడలు దూకి తలుపులు తెరిచేందుకు యత్నించే దృశ్యాలు నమోదయ్యాయి.

దీని గురించి విరుదాచలం పోలీసులకు రంజాన్‌ అలీ ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి దొంగ, మానసిక రోగా అని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సఘటనతో విరుదాచలం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.