సమాజంలో భార్యా భర్తల బందానికి విలువ లేకుండా పోతుంది. ఓ భార్య తన ఇద్దరు ప్రియులతో కలిసి కట్టుకున్న భర్తను చంపడానికి ప్లాన్ చేసింది.

ఇద్దరు ప్రియుళ్లతో కలసి భర్తను చంపేందుకు ఓ భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భర్తను చంపేందుకు ఆమె ప్రియుళ్లు ప్రయత్నించగా, బాధితుడు వారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనంతరం భార్యా బాధితుల సంఘాన్ని ఆశ్రయించారు. కరీంనగర్‌కు చెందిన ఓ వంశీకృష్ణకు, కావేరి అనే యువతితో పెళ్లయింది. అయితే, కావేరి గురించి చుట్టుపక్కల వాళ్లు కొన్ని ఫిర్యాదులు చేసినా అతడు పట్టించుకోలేదు. తన భార్య మీద నమ్మకంతో ఉన్నాడు. ఈ క్రమంలో భార్య సెల్‌ఫోన్‌లో ఉన్న ఫొటోలు చూసి అతడు షాక్‌‌కి గురయ్యాడు. తన ఇద్దరు ప్రియుళ్లతో బాగా సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూసి అతడు భార్యను ప్రశ్నించాడు.

అయితే, తమ గుట్టు బయటపడిపోవడంతో కావేరి భర్తను అంతం చేయాలనుకుంది. అతడు నిద్రపోతున్న సమయంలో తన ఇద్దరు ప్రియుళ్లతో కలసి అతడి ముఖం మీద దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేయాలని ప్లాన్ వేశారు. అది అమలు చేసే క్రమంలో బాధితుడు వారి నుంచి తప్పించుకుని గోడ దూకి పారిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత భార్యాబాధితుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు నిందితులు సమాన్విత్, గణేష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది.