ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఒపీ విభాగంలో వైద్యుల లేకపోవడం పై ఆగ్రహం.
- పలు విభాగాల్లో కి వెళ్లి హాజరు కాని వైద్యులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- ఎంజీఎంకు వచ్చిన పేషెంట్ల తో మాట్లాడిన మంత్రి.
- పలు విభాగాల్లో సేవల సరిగా లేపోవడంపై సూపరింటెడెంట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ :
- ఐదుగురు సీనియర్ డాక్టర్లు అందుబాటులో లేరు. చాలా బాధాకరం
- వైద్య సేవల పరంగా చాలా పొరపాట్లు ఉన్నాయి.
- డాక్టర్లకు మొదటి హెచ్చరికగా చెబుతున్నాం. మరోసారి ఇలా జరిగితే కటినంగా వ్యవహరిస్తాం.
- వాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించాను. వారు దీనిపై నిర్ణయిస్తారు.
- మీ డ్యూటీ సమర్థవతంగా చేయాలని వైద్యులను కోరుతున్నాను.
- దాతలు, ప్రైవేటు వైద్యుల సహాయంతో ఎంజీఎం లో ఫర్నిచర్, ఇతర వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- ఎంజీఎం ను పేదల పెన్నిధిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఎంజీఎం అభివృద్ధి కి అవసరమైన నిధులు ఉన్నాయి.