తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఎవరికి వారే విపరీతంగా ప్రయత్నం చేసుకుంటున్నారు . అయితే ఓ గ్రామంలో మాత్రం వార్డు మెంబర్‌కు పోటీ చేసే అభ్యర్థి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లు దర్శనం ఇచ్చాయి.

ఇక దీంతో తీవ్ర భయాందోళనలో ఉన్నారు కాలనీ వాసులు. ఈ సంఘటన ఆలేరు మండలం రఘనాథపురంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం : గ్రామానికి చెందిన బింగి నాగేశ్ ఈ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డులో పోటీలో ఉన్నాడు. కాగా రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున లేచి చూసేసరికి నాగేశ్ ఇంటి ముందు మంత్రాలు చేసిన గుడ్డు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపకొమ్మలు ప్రత్యేక్షమయ్యాయి. దీంతో ఆ కాలనీ వాసులు భయందోళనకు గురవుతున్నారు. మరీ ఎన్నికల్లో ఓడించేందుకే పన్నగం పన్నారా లేక మరేవిధంగానైనా కుటుంబాన్ని నష్ట పరిచేందుకు చేశారా అనేది తెలియాల్సి ఉంది.