యువతిని వేధించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని ఇద్దరు మహిళలు చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు: మహేశ్వర్‌ జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందనే సమాచారంతో ఎక్సైజ్‌ ఎస్‌ఐ మోహన్‌లాల్‌ భయాల్‌ తన సిబ్బందితో కలిసి రైడ్‌ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో ఓ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ ఇంటి వారికి, అధికారులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ మోహన్‌ భయాల్‌ తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ అతనిపై దాడి చేసింది.

అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో మోహన్‌ భయాల్‌ చొక్కా పట్టుకుని రోడ్డు మీదకు లాక్కొచ్చి మరి చితకబాదింది. ఇంతలో మరో మహిళ ఓ కర్ర తీసుకుని సదరు అధికారిని దారుణంగా కొట్టింది. చుట్టూ చేరిన జనాలు కూడా మహిళలకు మద్దతిస్తూ.. అధికారులను దూషించడం ప్రారంభించారు. ఇంత జరగుతుంటే కొందరు అధికారులు పక్కనే ఉండి చోద్యం చూశారు తప్ప జోక్యం చేసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై స్పందించిన అధికారులు మహిళలతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు…