హమారా వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూన్న డా. తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీచేసింది. ఐజీగా పదోన్నతి పోందిన డా.తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏప్రిల్ 7 వ తేదిన భాధ్యతలు స్వీకరించారు. డా.తరుణ్ జోషి హరియాన రాష్ట్రానికి చెందిన వాడుకాగా. డెంటల్ వైద్యం డాక్టర్ గా పట్టా పుచ్చుకోని ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో ఐపి ఎస్.గా ఎంపికయ్యాడు 2004 ఐపిఎస్ బ్యాచ్ చెందిన తరుణ్ జోషి శిక్షణ అనంతరం గోదావరి ఖని ఏఎస్పీగా మరియు ఆదిలాబాద్ ఓఎస్డీగాను పనిచేసారు.

2009 మరియు 2010 సంవత్సరంలో వరంగల్ ఓఏస్డీగా పనిచేసారు. అ తర్వాత వైజాగ్ సిటి ఎస్పీగాను, గ్రేహౌండ్స్, నిజామాబాద్, హైదరాబాదు సెంట్రల్ జోన్ , ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసారు. డీ.ఐ.జీ పదోన్నతిపై హైదరాబాదు స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ పనిచేసిన అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ గా భాద్యలు స్వీకరించారు.