నమ్మి తన భార్య చేనులో ఉందని తీసుకరమ్మని బైక్ ఇచ్చి పంపిన భర్త

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ లో వివాహితపై మద్యం సేవించిన వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన వ్యక్తి, శ్రీనివాస్ గౌడ్ తో రోజు మద్యం సేవించేవాడు. ఇద్దరు కలిసి మెలిసి స్నేహంగా ఉండేవారు. సదరు వ్యక్తికి శ్రీను నమ్మిన బంటుగా ఉండేవాడు. సదరు వ్యక్తి మద్యం బాగా సేవించడంతో తన భార్య చేనులో ఉందని తీసుకరమ్మని బైక్ ఇచ్చి శ్రీనును పంపించాడు.

దీంతో శ్రీనివాస్ చేనుకు వెళ్లి ఆమెపై అఘాయిత్యం చేసి హతమార్చాడు. అనంతరం గ్రామస్థులకు ఫోన్ చేసి వివాహిత చనిపోయిందని కబురుపంపాడు. వెంటనే గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా మహిళ నగ్నంగా మృతి చెంది ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్ ను బేగంపేటలో పట్టుకొని గన్నేరువరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని ఆమె భర్త ఆందోళనకు దిగాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.