నేటి కాలంలో తప్పు చేయడం మనిషికి ఓ అలవాటుగా మారిపోయింది. అది సర్ధుకుపోయే తప్పిదం అయితే పర్వలేదు కానీ జీవితాన్ని అగాథంలోకి నెట్టేసేది అయితే కష్టమే. క్షణికావేశంలోనో, ఉద్దేశ పూర్వకంగానో కొందరు తప్పులు చేసి శిక్షలను అనుభవిస్తున్నారు. జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారు. కుటుంబానికి, బంధువులు, బంధాలకు దూరంగా కారగారాల్లో ప్రాయశ్చిత పడుతూ బతుకును వెళ్లదీస్తున్నారు. అయితే వేల మంది ఖైదీలు శృంగార సుఖం లేక మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఏళ్ల తరబడి ఇలాగే ఉంటుండంతో వారిలో మానసిక రుగ్మతలు వస్తున్నాయని జైలు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ నివేదికను అందుకున్న ప్రభుత్వం ఖైదీల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

పంజాబ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఖైదీల కామ కోరికలను తీర్చడానికి ముందుకు వచ్చింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు పడక సుఖం అందించేందుకు ఏర్పాట్లు కల్పించింది. తన జీవిత భాగస్వామితో మూడు నెలలకో సారి రెండు గంటల పాటు సెక్స్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు జైలులోనే డబుల్ కాట్ బెడ్, అటాచ్డ్ బాత్రూం ఉన్న గదిని కేటాయిస్తున్నారు. ఈ సదుపాయాన్ని ఆడ, మగ ఖైదీలకు వర్తింపజేస్తున్నారు. గదిలో వాళ్లు ఏకాంతంగానైన మాట్లాడుకోవచ్చు లేదా సెక్స్ చేసుకోవచ్చు. ఆ జంటకు జైలు అధికారులు కండోమ్‌లను సైతం అందిస్తున్నారు. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదులకు మొదటి అవకాశం ఇస్తున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారు గ్యాంగ్ స్టర్లు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ అవకాశం ఉండదని జైలు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17జైళ్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.