సంక్రాంతి పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలిక అనూహ్యరీతిలో ఓ యువకుడి చేతిలో బలైంది. అమ్మమ్మ ఆ బాలికను హైదరాబాద్ బస్సెక్కించమని చెప్పి ఇంటికి సమీపంలో ఉండే ఓ యువకుడితో పంపించగా ఇదే అదనుగా భావించి ఆ యువకుడు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమై బాలిక మృతి చెందింది. సంక్రాంతి పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక కామాంధుడి చేతిలో బలైంది. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక ఆడుతూ పాడుతూ ఆహ్లాదంగా గడిపింది. బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సెలవులు పూర్తవడంతో బాలిక అమ్మమ్మ బాలికను హైదరాబాద్‌కు పంపించేందుకు ఇంటి సమీపంలో ఉన్న యువకుడికి బస్ ఎక్కించమని చెప్పి పంపించింది.

అయితే, ఆ యువకుడు బాలికను బస్టాప్‌కు కాకుండా, అంగడిపేట గేట్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో నిందితుడు ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయాడు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బంగారం లాంటి బాలిక యువకుడి చేతిలో బలైన వార్త తెలిసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడు దిలీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక బంధువులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.