ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధించిన హైకోర్టు సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సింగిల్ బెంచ్ గతంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటీషన్ ను కొట్టివేసింది. ఈ కేసు సీబీఐకి వెళ్తుందా లేక సిట్ కు అప్పగిస్తారా అనే ఉత్కంఠ హైకోర్టు తీర్పుతో వీడింది..