డెలివరీ చేస్తుండగా తల్లి, బిడ్డ మృతి చెందిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. ఇస్‌పేట గ్రామానికి చెందిన బాలింత కవిత డెలివరీ కోసం సోమవారం చిట్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. డెలివరీ చేస్తుండగా తల్లి, బిడ్డ మృతి చెందిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. ఇస్‌పేట గ్రామానికి చెందిన బాలింత కవిత డెలివరీ కోసం సోమవారం చిట్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే గైనకాలజిస్ట్‌ అందుబాటులో లేకుండానే ఆసుపత్రి సిబ్బంది సాధారణ ప్రసవం చేసేందుకు లేబర్‌ రూమ్‌కి తీసుకెళ్లారు. నార్మల్‌ డెలివరీ చేస్తుండగా పరిస్థితి విషమించడంతో బాలింత అక్కడికక్కడే చనిపోయింది. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే కవిత మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.