హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానించారని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్‌కే పరిమితమవుతారా? అని మండిపడ్డారు. కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గన్పించడం లేదా ? అంటూ ఫైర్ అయ్యారు. ఇదేనా మీ సంస్కారం అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందని బండి నిలదీశారు. కేసీఆర్ కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా ? అని బండి సంజయ్ ప్రశ్నించారు.