{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1642424606676","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"version":1,"sources":[]}","premium_sources":[],"fte_sources":[]}

పంజాబ్ లోని కపుర్తాలో దారుణంలో జరిగింది. కేసర్ పూర్ గ్రామానికి చెందిన మంజిత్ సింగ్ (27), బల్వీందర్ కౌర్ (24) దంపతులు. వీరిద్దరి కాపురం కొన్నేళ్లపాటు సజావుగా సాగింది. అయితే, వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఆమెకు మూడేళ్లు. కొన్ని రోజులుగా వీరి మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. మంజిత్ సింగ్, తన భార్యపై అనుమానపడేవాడు. బల్వీందర్ కౌర్ వేరే వ్యక్తులతో ఎఫైర్ కొనసాగిస్తుందేమోనని అనుమానపడేవాడు. ఈ క్రమంలో ఆమె మరోసారి గర్భవతి అయ్యింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ కొడుకు పుట్టాడనే ఆనందం మంజిత్ సింగ్ లో మాత్రం లేదు. తన పెళ్లాం ఏదో తప్పు చేసిందని, కోపంతో రగిలిపోయాడు.

ఆమె ఒంటరిగా దొరకటం కోసం వేచిచూశాడు. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రిలో ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు. దిండు తీసుకొని, ఆమె ముఖంపైన పెట్టి ఊపిరాడకుండా చూసి హతమార్చాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న వైద్యులు విగత జీవిగా ఉన్న మహిళను చూశారు. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. అక్కడి సీసీ కెమెరాలను గమనించారు. మహిళ భర్త పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.