బెంగళూరులో ఓ పెళ్ళిలో నూతన వధూవరులకు ఉల్లి పాయలు గిఫ్ట్ నవ్వులు పూయించింది. ఉల్లి ధరలు యెంత భారమయ్యాయో ఇలా తెలిసొచ్చేట్టు చేశారు.. కిలో రూ.150 చొప్పున కొనుగోలు చేసిన రెండు కేజీల ఉల్లిగడ్డలను ఆ యువజంటకు స్నేహితులు కానుకగా అందించారు. ఈ విషయం తెలియక ఆ కొత్త జంట ఆ కానుకను తెరవగానే ఒక్కసారిగా పెళ్లి మండపంలో నవ్వులు విరబూశాయి.