ప్రపంచకప్‌లో భారత్ తన ప్రస్థానాన్ని సెమీస్‌తోనే ముగించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓడిన భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సుమారు రూ.5.47 కోట్లు (0.8 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనుంది. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లు. లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు గాను జట్టుకు సుమారు రూ.27.4 లక్షలు (40 వేల డాలర్లు) చొప్పున అందిస్తారు. అయితే సెమిస్‌కు చేరిన ప్రతి జట్టుకూ 0.8 మిలియన్ డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కుతుందని ఐసీసీ తెలిపింది. దీని ప్రకారం భారత్, ఆస్ట్రేలియా జట్లకు రూ.5.47 కోట్లు ప్రైజ్ మనీని అందుకుంటారు. అయితే ఫైనల్‌గా కప్‌ని గెలుచుకున్న విజేతలకు 4 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ.27.38 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్‌కు 2 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.13.7 కోట్లు లభిస్తుంది.