చెన్నై: ఓ టీవీ యాంకర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడికి పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ ఈరోడ్‌ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు: ఈరోడ్‌కు చెందిన 26ఏళ్ల యువతి లోకల్‌ టీవీలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఈరోడ్‌ ముత్తంపాలయానికి చెందిన రాహుల్‌ (29)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది.

2018 కోవైలో ఓ ప్రోగ్రాంకి వెళ్లిన సమయంలో హోటల్‌కు తీసుకెళ్లిన రాహుల్‌ తనను వివాహం చేసుకుంటానని చెప్పి బలాత్కారం చేశాడని, అలాగే తన వద్ద 750 గ్రాముల సవర్ల బంగారు నగలు మోసం చేశాడని ఆరోపించింది. ఈ మేరకు ఆగస్టులో ఈరోడ్‌ మహిళాపోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో రాహుల్‌ మోసానికి పాల్పడినట్లు తేలడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు ఇచ్చారు.