కార్యాలయం లోనికి శివమ్మ అనే మహిళ కొడవలితో

తమకి ఈ నెల రావాల్సిన పించిన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శిని కొందరు వ్యక్తులు బెదిరించిన వైనం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన కొందరు తమకి ఈ నెల పింఛన్ రాలేదు అని పంచాయతీ కార్యదర్శి నిలదీశారు. దానికి మురళీశర్మ సమాధానం ఇస్తూ ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని చెప్పుకొచ్చాడు.

దీనితో ఆగ్రహానికి గురైన వారు మురళీశర్మ ను బెదిరించారు. వచ్చే నెలలో ఫించిన్ ఇవ్వకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు ఆ కార్యాలయం లోనికి శివమ్మ అనే మహిళ కొడవలితో రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…