ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చిన అనంతరం మహిళపై అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ప్రకాశ్ అనే వ్యక్తి ఘజియాబాద్‌లో నివసిస్తున్నారు. మహిళ తన కుటుంబంలో కలిసి దశ్నాలో నివసిస్తోంది. ఒక్కసారి షాపింగ్‌కోసం ఘజియాబాద్‌కు వెళ్లింది.

ఆటోలో వెళ్తున్నప్పుడు ప్రకాశ్ ఆమెకు పరిచయమయ్యాడు. స్థానిక బట్టల దుకాణంలో పని చేస్తానని, తమ దుకాణానికి వస్తే పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇప్పిస్తానని చెప్పాడు. అక్టోబర్ 4న ఆ అమ్మాయికి ఫోన్ కావాలని అడిగాడు. దీంతో ఆమె వెంటనే ఘజియాబాద్‌కు చేరుకుంది. లంచ్ చేద్దామని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఫస్ట్ కూల్ డ్రింక్ తీసుకున్న అనంతరం ఆమె నిద్రలోకి జారుకుంది.

ఆమెకు మెలుకువ వచ్చేసరికి నగ్నంగా ఉంది. అతడు సోపాలో కూర్చొని ఉన్నాడు. అతడితో కలిసి హోటల్ నుంచి బయటకు వస్తుండగా ఆమె అన్నయ్య స్నేహితుడు చూశాడు. వెంటనే ప్రకాశ్ అక్కడి నుంచి బైక్‌పై తప్పించుకున్నాడు. ఐపిసి 376 ప్రకారం నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.