మూడేళ్లుగా సహ జీవనం చేస్తున్న రోహ్మన్ షా, సుస్మితా సేన్ విడిపోవడం బాలీవుడ్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తమ రిలేషన్‌షిప్, బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో వెల్లడిస్తూ నర్మగర్బమైన పోస్టును తాజాగా పెట్టడం మరోసారి చర్చకు దారి తీసింది. అయితే బ్రేక‌ప్ నుండి సింగిల్ లైఫ్ ని మళ్లీ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట మరోసారి కలిసి వార్తల్లో నిలిచారు. బ్రేకప్‌ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలుసుకోవడమే కాకుండా ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరా కంట కూడా పడ్డారట. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ కలుసుకోవడానికి కారణం ఈ ఇద్దరికీ పరిచయమున్న ఒక ఫ్రెండ్‌ను కలవడానికని తెలుస్తోంది. సుస్మితను ఇంటి నుంచి రోహ్మన్‌ షానే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారని, కామన్ ఫ్రెండ్ తో కొద్దిసేపు ముచ్చటించి ఇద్దరు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ మళ్లీ కలుస్తారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్ర‌స్తుతం బీ టౌన్ లో ఈ విషయంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే సుస్మితా సేన్ ముంబైకి చెందిన ఓ రెస్టారెంట్ బిజినెస్ మ్యాన్‌తో తొలి అఫైర్ కొనసాగించింది. వారిద్దరూ 2017లో విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా, సోనాక్షి సిన్హా ప్రియుడిగా చెప్పుకొంటున్న బంటీ సజ్దేహ్‌తో, దర్శకుడు విక్రమ్ భట్, సంజయ్ నారంగ్‌తో, హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో, దర్శకుడు ముదస్సర్ అజిజ్‌తో, అలాగే క్రికెటర్ వసీం అక్రమ్‌తో అఫైర్, డేటింగ్ చేసినట్టు మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి, సుస్మిత సేన్ తన కంటే 15ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్ షాతో మూడేళ్ల క్రితం రిలేషన్‌షిప్ ప్రారంభించింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ఓ చేశారు. సుస్మిత సేన్‌తోపాటు తన దత్త పుత్రికలు రీనీ, అలిషాతోపాటు రోహ్మాన్ కుటుంబంగా మారిపోయారు. చక్కటి ఫ్యామిలీగా అభిమానులకు బిల్డప్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా బ్రేకప్ విషయాన్ని బయటపెట్టారు.