దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని యువతిని కొందరు దుండగులు పార్క్‌‌లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం..

ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీలో మతిస్థిమితం లేని యువతి (23) కొద్ది రోజులుగా తిరుగుతోంది. దొరికింది తింటూ రోడ్డు పక్కనే పడుకుంటోంది. సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి వేళ స్థానిక ఇంద్రప్రస్థ పార్క్ సమీపంలో నిద్రపోతున్న యువతిని కొందరు వ్యక్తులు పలకరించారు. తమ వెంట వస్తే భోజనం పెడతామని నమ్మించి పార్క్‌లోని పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో చనిపోయిందని భావించి రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయారు…