యువతిని మాయమాటలతో తన వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, ఈ క్రమంలో ఏడాది పాటు ఆమెపై తన కోరికలు తీర్చుకున్నాడు. కొందరు తమ అవసరాలకు ప్రేమను పావుగా వాడుకుంటున్నారు. ప్రేమిస్తున్నామని చెబుతున్నారు, వీరి మాటలను నమ్మి ఎదుటి వారు వీరి వల్లో పడుతున్నారు. తమ మోజు తీరాక ముఖం చాటేస్తున్నారు. యూపీలోని ఫతేపూర్ లో దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది: రాహుల్ గుప్తా అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన సరస్వతి దేవీతో ఏడాది పాటు వివాహేతర సంబంధం కొనసాగించాడు. తన కోరికలన్ని తీర్చుకున్నాడు.

ఆ తర్వాత యువతి తనను పెళ్లి చేసుకొవాలని కోరింది. దీంతో అతను ప్రతిసారి మాట దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో యువతి అతడిని గట్టిగా నిలదీసింది దీనికి అతను ఒప్పుకోలేదు. యువతి ఇంటికి వెళ్లి గర్బం తీయించడానికి ప్రయత్నించాడు. దీనికి యువతి ఒప్పుకొకపోవడంతో గొడవ పడ్డాడు. కోపంలో యువతిపై కత్తులతో దాడిచేశాడు. ఆమె అక్కడికక్కడే కింద పడి చనిపోయింది. ఈ క్రమంలో యువతి సోదరి ఆమెను ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే చనిపోయింది బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని విచారణ చేపట్టారు.