యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ గా తెలంగాణా కు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్ గా జగదీష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు.యూజీసీ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు కొనసాగుతారని కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఇంటిపేరు ఉరుపేరు ఒక్కటే కావడం యాదృచ్చికం.