నరగంలోని దుమ్మాయిగుడాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే, మల్కాజ్గిరిలోని ఓ షాపింగ్ మాల్లో యువతి సేల్స్గర్ల్గా పనిచేస్తోంది. శనివారం ఇద్దరు మైనర్ బాలురు యువతిని బలవంతంగా తమ బైక్పై ఎక్కించుకుని దుమ్మాయిగుడాలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ యువతిపై ఇద్దరు బాలురు అత్యాచారయత్నానికి ప్రయత్నించగా..యువతి భయంతో కేకలు వేయగా అది గమనించిన స్థానికులు యువతిని రక్షించి పోలీసులకు సమాచారం అందించారు.