వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు సంయుక్తం కల్సి అరెస్ట్ చేసారు. ఈ ముఠా నుండి రెండు వేల రూపాయలనోట్లు మూడు వందలు (ఆరులక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమయిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు: సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), (31), పెద్దమ్మగడ్డ, హనుమకొండ, యం.డి సమీర్,(30), న్యూరాయపుర, హనుమకొండ (ప్రస్తుతం పరారీలో వున్నాడు), పేరాల అవినాష్ (28), పెద్దమ్మగడ్డ, హనుమకొండ, కత్తి రమేష్ (24), రాజీవ్ నగర్, నర్సంపేట, వరంగల్ జిల్లా, యం.డి అక్రం ఆలీ (27), మచిలీబజార్, హనుమకొండ, గడ్డం ప్రవీణ్ (33), చింతల్ బస్తీ, కాజీపేట్, గుండ్ల రజనీ (33), చింతల్ బస్తీ, కాజీపేట్, కత్తి సునిత (23), సోహెల్ (22), కాపువాడ, హనుమకొండ కు చెందిన వారు వున్నారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసుల అరెస్ట్ చేసిన సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయంతో వారి ద్వారా దొంగ నోట్ల ముద్రించి తీరును తెలుసుకున్న నిందితులు జైలు నుండి విడుదల అనంతరం నిందితులు సులభం డబ్బు సంపాదించాలనుకున్నారు. దీనితో నిందితులు నేర చరిత్ర కలిగిన నిందితులతో కల్సి నోట్ల తయారీ శ్రీకారం చుట్టారు. తాము ముద్రించిన రెండు వేల నోటుపై ఎవరి అనుమానం కలగకుండా వందేండుగాను ఈ ముఠా యూట్యూబ్ అనుసరించడంతో పాటు ఓరిజినల్ రెండు వేల రూపాయ కాగితాన్ని పోలివుండే కాగితాలను ఈ ముఠా కోనుగోలు చేసి నకిలీ నోట్లును ముద్రించేవారు.

నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీ వుండే వ్యాపార కూడళ్ళతో పాటు కిరాణం, బట్టలషాపు, మద్యం బెల్ట్ షాపు వద్దకు నకిలీ నోట్లను చెలామణి చేసేవారు. గత సంవత్సర కాలంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లోను నకిలీ నోట్లను చెలామణి చేసారు. వచ్చిన డబ్బుతో నిందితులు మద్యం సేవిస్తూ, జల్సాలు చేసేవారు. ఈ రోజు ఉదయం ప్రధాన నిందితుడు మరో నిందితుడు అవినాష్తో దొంగనోట్లను చెలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన వారి విచారించగా నిందితులు ఇచ్చిన సమాచారంతో మిగితా నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి నకిలీ నోట్ల స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఈ దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, ఇన్సెస్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నరేష్ కుమార్, ఎస్.ఐలు నిస్సారాషా, సుబేదారి ఎస్.ఐ రవికిరణ్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబులు రాజేష్, బిక్షపతి, శ్రీను, శ్రవణ్ కుమార్, రాజు, గౌతంలను పోలీస్ కమిషనర్ అభినందించారు.