వచ్చే శాసనసభ ఎన్నికలలో నర్సంపేట గడ్డ పై భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త సమిష్టిగా పని చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

శనివారం నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగినది.ఈ సమావేశంలో నూతనంగా ఇటీవల ఎన్నికైన నర్సంపేట టౌన్, దుగ్గొండి, చెన్నారావుపేట మండలాల అధ్యక్షులు బాల్నే జగన్ గారు,చుక్క రమేష్ గారు,బల్గూరి నరేందర్ రెడ్డి గారు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారికి బోకే ఇచ్చి శాలువా కప్పి సన్మానించి, కృతజ్ఞతలు చెప్పి వారి పై నమ్మకంతో పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ గ్రామ స్థాయిలో పటిష్టం చేసేందుకు అహర్నిశలు తాము కృషి చేస్తామని వారు అన్నారు.

ఈ సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి రోజురోజుకు ప్రజలలో ఆదరణ పెరుగుతుందని, తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట నియోజకవర్గం తన హయాంలోనే అభివృద్ధి చెందినదని కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసింది ఏమీ లేదని గ్రామాల్లో మనం చేసిన అభివృద్ధిని ప్రజల చర్చకు బట్టి బూత్ స్థాయి నుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు బాధ్యతతో ప్రతి నాయకుడు పనిచేయాలని ప్రకాశ్ రెడ్డి గారు కోరారు.

మీకు ఇచ్చిన నాయకత్వ బాధ్యతలను ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలలో ఆదరణ పొంది మంచి నాయకుడిగా ఎదిగి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రకాశ్ రెడ్డి గారు అన్నారు.అందుకు అంకురార్పణ గా వచ్చే మున్సిపల్ ఎన్నికలలో ఈ నియోజకవర్గం లోని ఏకైక మున్సిపాలిటి అయినా నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసేలా నర్సంపేట పట్టణ ప్రజలతో పరోక్షంగా,ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బిజెపిని ఆదరించేలా అభిమానించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రకాశ్ రెడ్డి గారు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.