మండల ఎస్సై భూక్య నరహరి ఆధ్వర్యంలో పట్టణంలో డయల్ 100 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ: ఎవరైనా అత్యవసర పరిస్థితులలో 100 కు ఫోన్ చేస్తే వెంటనే పోలీస్ వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలు వారికి ప్రతికూల సంఘటనలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా డయల్ 100 ను సంప్రదించాలని సూచించారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల హత్యలను నిరోదించాలంటే తప్పనిసరి పోలీస్ సహకారం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు