ఒంగోలులో ఇద్దరు యువతుల వివాహం హాట్ టాపిక్ గా మారింది. సుమలత అనే యువతీ తన కూతురిని ట్రాప్ చేసిందని రమ్య తల్లి తండ్రులు గొడవకు దిగారు. దీనితో ఈ వ్యహారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి చేరింది. అయితే తాము సిస్టర్స్ లా కలిసి మెలిసి ఉంటామని చెబుతున్నారు ఆ ఇద్దరు యువతులు. అంతే కాకుండా తాను సుమతోనే కలిసి ఉంటానని రమ్య స్పష్టం చేస్తుంది. ఇద్దరూ కూడా మేజర్ లు కావడంతో పోలీసులు కూడా వారి వద్ద నుండి వివరాలు తీసుకొని పంపించారు. గతంలో సుమ అనే యువతి పలువురి యువతులను ట్రాప్ చేసిన కేసులో నిందితురాలు. సుమలత తన శృగార కోరికలు తీర్చుకున్నదని కేసు నమోదు అయింది. పోలీసులు సుమలత ఇంట్లో సోదాలు చేయగా కొన్ని శృగార టాయ్స్ బయట పడ్డాయి. దీనితో అవమాన భారంతో సుమలత భర్త ఏడుకొండలు ఇంటి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇల్లు అద్దెకు తీసుకొని మరీ పాడు పని:

ఈ ఘటన పై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే అక్కడి నుండి ప్లేస్ మార్చిన సుమలత ఒంగోలు రంగు తోటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని తిరిగి యువతులను ట్రాప్ చేయడం మొదలు పెట్టింది. సుమలత ట్రాప్ లో రమ్య పడిందని ఆమె తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే తాము ఫేమస్ అవ్వడం కోసం ఇలా చేశామని సుమలత చెబుతుంది.