ఓ మహిళ పక్కింటి తండ్రీ కొడుకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి, వాటితో బెదిరించి లైంగికంగా వేధించడమే కాకుండా డబ్బుల కోసం బెదిరిస్తున్నారంటూ పేర్కొన్నది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారంః మైసూర్ కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాను స్నానం చేస్తుండగా తమ ఇంటి పక్కనే ఉండే తండ్రీకొడుకులు వీడియోలు తీసి, వాటిని ఆమె ఫోన్ కు పంపి లైంగికంగా వేధించడంతోపాటు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారంటూ మహిళ ఫిర్యాదు చేసిందని అందులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వార్తా కథనంలో తెలిపారు