సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్‌ విధించనున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్‌ మీడియాతో తన ఫస్ట్‌ మూవీ గురించి రష్మిక చేసిన కామెంట్స్‌ ఈ వివాదానికి కారణమయ్యాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్‌ నాగశేఖర్‌ స్పందించారు. ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రష్మిక బ్యాన్‌ గురించి ప్రశ్నించగా ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు.

నేను కూడా సంజు వెడ్స్‌ గీత సినిమా కోసం చాలామంది నటీనటులకు ఛాన్స్‌ ఇచ్చాను. వాళ్లు అది గుర్తుపెట్టుకుంటారా? లేదా అన్నది వాళ్ల వ్యక్తిగతొం నేను అది పట్టించుకోను. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం బాధపడతాం. రష్మికపై బ్యాన్‌ విషయానికి వస్తు దీని గుర్తించి నాకు పూర్తిగా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఇలాంటివి నేను సపోర్ట్‌ చేయను అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం డైరెక్టర్‌ నాగశేఖర్‌ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి..