దుండిగల్ పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేగింది. కుత్బుల్లాపూర్‌లో 19 ఏళ్ల యువతి అదృశ్యమైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని మలంపేట్‌కు చెందిన గాయత్రి హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తోంది.

రోజులాగే బుధవారం కూడా సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. ఐతే రాత్రైనా ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఆమో ఆచూకీ దొరకకపోవడంతో గురువారం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రి కోసం గాలిస్తున్నారు. ఆమె నివసించే ప్రాంతం, పనిచేసే ప్రాంతంలోని సిీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.