హైదరాబాద్ పాతబస్తీలో బాలికపై గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. బాలికను కిడ్నాప్ చేసి ఓయో రూంకు తీసుకెళ్లిన దుండగులు రెండ్రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మత్తుమందు ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులు అనంతరం ఓయో రూమ్లో ఆమెను వదిలివెళ్లారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.