కార్తీక మాసం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శివారులోని ఉసిరివనంలో 108 జంటలు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కామధేను గోశాలలో 25 జంటలు కార్తీక సమారాధన, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ, ప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు, అన్ని వ్రతాలలో కెల్లా సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశిష్టమైనదని, కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటిదని పూర్వజన్మ ఫలమని అన్నారు.