సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని శ్రీనివాసపురానికి చెందిన దళిత బాలిక ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అయితే, అదే గ్రామానికి చెందిన జింకల మహేష్ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అది నమ్మిన బాధితురాలు అతడికి దగ్గరైంది. ఈ క్రమంలో గడిచిన రెండేళ్లలో వారు శారీరకంగా ఎన్నోసార్లు కలిసినట్టు బాలిక పేర్కొంది. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం బాలికకు వీడియో కాల్ చేసి నగ్నంగా కనిపించాలని కోరటంతో ఆమె అలాగే చేసింది. ఆ వీడియో కాల్ను మహేశ్ సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవలే వారి మధ్య కొన్ని గొడవలు జరగడం తాను చెప్పినప్పుడు తనవద్దకు రావాలని మహేష్ కోరడంతో బాధితురాలు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహేష్, బాలిక నగ్న వీడియోను తన వాట్సప్ స్టేటస్లో పెట్టాడు.
దీంతో ఆ వీడియో చూసిన స్థానికులు సదరు బాలికకు విషయం చెప్పడంతో ఒక్కసారిగా షాకైంది. వెంటనే వీడియో విషయాన్ని తన పేరెంట్స్ చెప్పింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబంలో మహేష్ ఇంటికి వెళ్లగా వారు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లినట్టు తెలిసింది. మహేష్ సైతం పరారీలో ఉన్నాడు. దిక్కుతోచని స్థితిలో మరుసటి రోజు బాధిత బాలిక, ఆమె కుటుంబసభ్యులు జరిగిన ఘటనపై హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహేశ్పై పోలీసులు అట్రాసిటీ, అత్యాచారం, ఐటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.